Nandamuri Family: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎన్డీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.