Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఆగలేదు: కేంద్రం
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.
పాకిస్థాన్కు స్పైగా పనిచేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రాపై ఏడాది క్రితమే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశాడు. 'కపిల్ జైన్' అనే ఎక్స్ యూజర్ జ్యోతి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని NIA ని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ స్పైగా వ్యవహరించిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా జ్యోతి చిన్నతనం గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ఏడాదిన్నర వయసుకే జ్యోతిని ఆమె తల్లి అనాథాశ్రమంలో వదిలివేసి వెళ్లిపోయిందని తెలిపారు.
పాకిస్థాన్ భారత్పై దాడులు చేసేందుకు యత్నించినప్పుడు పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ను లక్ష్యంగా చేసుకుందని మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వేట కొనసాగుతూనే ఉంది. అయితే లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న ముగ్గురు ఉగ్రవాదులను తాజాగా జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. బడ్గాం జిల్లాలో వీళ్లని అదుపులోకి తీసుకున్నారు.