డిజిటల్ అరెస్టు పేరుతో ముంబై మహిళకి టోకరా.. రూ.20.25 కోట్లు కాజేసిన కిలాడీలు
డిజిటల్ అరెస్టు పేరుతో ఓ వృద్ధురాలి దగ్గర రూ.20.25 కోట్లు కాజేసిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందని ఆమెను డిజిటల్ అరెస్టు చేసి రూ.20.25 కోట్లు కొట్టేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన ఆ వృద్ధురాలు పోలీసులను ఆశ్రయించింది.