/rtv/media/media_files/2025/03/30/WpKUGplDuhe91cNzvLXk.jpg)
mi vs gt Photograph: (mi vs gt)
IPL 2025: ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు బిగ్ షాక్ తగిలింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా పడింది. దీంతో ఈ సీజన్లో ఫైన్ ఎదుర్కొన్న తొలి కెప్టెన్గా పాండ్య నిలిచాడు.
Smiles that made our evening better!😁 pic.twitter.com/SX74VFSYIn
— Gujarat Titans (@gujarat_titans) March 30, 2025
ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం..
ఈ మేరకు ‘ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తొలి తప్పిదం చేసింది. కాబట్టి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ప్రకారం స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ. 12 లక్షల జరిమానా విధించాం' అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ప్రకటించింది. అయితే కొత్త ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. స్లో ఓవర్ రేట్కు పాల్పడినప్పటికీ ఆ జట్టు కెప్టెన్ పై వేటు పడదు. కానీ జరిమానా విధించడంతోపాటు డిమెరిట్, సస్పెన్షన్ పాయింట్లను కేటాయిస్తారు. ఇవి 36 నెలలపాటు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఇదిలా ఉంటే.. పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ టీమ్ ఈసారి ఆరంభం నుంచే బోల్తా పడుతోంది. ఇప్పటికి జరిగిన రెండు మ్యాచ్ లలోనూ ఓడిపోయింది. మొదటి మ్యాచ్ లో సీఎస్కే మీద మూడు వికెట్ల తేడాతో ఓడిపోయిన ముంబై ఇండియన్స్ ఈరోజు గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది. టైటాన్స్ ఇచ్చిన 197 పరుగుల లక్ష్యాన్ని చేయలేకపోయింది. సూర్య కుమార్, తిలక్ వర్మ కష్టపడినా రోహిత్ తో సహా మిగతా బ్యాటర్లు అందరూ తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో ముంబై మ్యాచ్ ఓడిపోయింది. సూర్యకుమార్ 49 పరుగులు చేసి చివర్లో క్యాచ్ ఇచ్చి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో గుజరాత్ ముంబై ఇండియన్స్ మీద 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. జీటీ బౌలర్స్ లో సిరాజ్ 2, ప్రసిధ్ కృష్ణ 2, సాయి కిశోర్ 1, రబడా 1 వికెట్లు తీశారు.
ipl-2025 | mumbai | gujarath | telugu-news | today telugu news