చెల్లెళ్లు, మరదళ్లకు పదవులు.. PCC చీఫ్ పై తిరగబడ్డ మహిళా నేతలు.. గాంధీభవన్ లో రచ్చ!
తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు గాంధీభవన్ లో ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. మహిళా నేతలతో కలిసి సునీతారావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు.