వాడో ముసలోడు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కొండా మురళి షాకింగ్ కామెంట్స్!

కడియం శ్రీహరి బీఆర్ఎస్, టీడీపీ పార్టీలను భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడని కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి 75 ఏళ్ల ముసలోడని.. దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలన్నారు.

New Update
Konda Murali Kadiyam Sreehari

సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, కేసీఆర్ ను ఆయన మోసం చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడంటూ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ మారి వచ్చిన వారు దమ్ముంటే మళ్లీ రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.

ప్రకాశ్ రెడ్డి 75 ఏళ్ల ముసలోడు ..

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించారు. మొన్ననే తన దగ్గరకు వచ్చి ముసలోడు కాళ్లు పట్టుకున్నాడంటూ చెప్పారు. ఇక మీదట పరకాల నియోజకవర్గం తన కూతురు సుస్మిత పటేల్ దేనన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నంతవరకు సురేఖ మంత్రి పదవి ఎటు పోదని ధీమా వ్యక్తం చేశారు. 

సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పోలీస్ స్టేషన్ వెళ్లి హల్ చల్ చేయడం, మంత్రులు సాధారణంగా పర్సంటేజ్ తీసుకుంటారని మాట్లాడడంతో సురేఖపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ సాగింది. ఓ దశలో ఆమె మంత్రి పదవి పోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో హైకమాండ్ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా పార్టీకి ఇబ్బంది కలిగించేలా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు