తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఏకంగా మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు గాంధీభవన్ లో ధర్నాకు దిగడం సంచలనంగా మారింది. మహిళా నేతలతో కలిసి సునీతారావు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. చెల్లెళ్లు, మరదళ్లకు మహేష్ కుమార్ గౌడ్ పదవులు ఇచ్చుకుంటున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. కష్టపడ్డ మహిళలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
(telugu-news | telugu breaking news | latest teluu news)