Champions Trophy 2025: నిమిషాల్లోనే అమ్ముడుపోయిన భారత మ్యాచ్ టికెట్స్.. 25 వేలకు లక్షా యాభై వేలు!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టికెట్ల కోసం జనం ఎగబడుతున్నారు. సోమవారం భారత్ ఆడే లీగ్ మ్యాచ్ల టికెట్స్ ఆన్లైన్లో ఉంచగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. 25వేల టికెట్ల కోసం లక్షా యాభైవేల మంది పోటీపడ్డట్లు దుబాయ్ స్పోర్ట్స్ సిటీ స్టేడియం నిర్వాహకులు తెలిపారు.