/rtv/media/media_files/2025/02/03/TAbL3xDjM587k2UdIBGD.jpg)
Nara Lokesh Key decision on AP private schools recognition
AP Schools: ఏపీలోని ప్రైవేట్ స్కూళ్ల గుర్తింపు గడువును 10ఏళ్లకు పెంచనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, యాజమాన్యాలతో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా పోటీ పోడి విద్యావ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం..
ఈ మేరకు లోకేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైంది. విద్యాశాఖ మంత్రిగా నాపై పవిత్ర బాధ్యత ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వ అసమర్ధత వలన లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలివెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కరిక్యులమ్ లో మార్పులు తీసుకురావడంతో పాటు నైతిక విలువలు పెంపొందించేందుకు చర్యలు చేపట్టాం. వైసీపీ హయాంలో విద్యావ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పడిపోతే అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పాఠశాల విద్యలో సంస్కరణలపై మేం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తున్నామని చెప్పారు.
వైసీపీ పాలనలో గందరగోళం..
అలాగే తాను ఏరికోరి విద్యాశాఖను ఎంచుకున్నానని, వైసీపీ పాలనలో గందరగోళంగా మారిన విద్యావ్యవస్థను ఛాలెంజ్ గా తీసుకుని పనిచేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మేం చేయాలనే తపనతో ఉన్నాం. విద్యరంగంలో ప్రైవేటు, ప్రభుత్వానికి బాధ్యత ఉంది. అందరం కలిసి విద్యా వ్యవస్థను బలోపేతం చేద్దాం. యువగళం పాదయాత్ర సమయంలో ఉపాధ్యాయుల సమస్యలు అనేకం నా దృష్టికి వచ్చాయి. పాదయాత్రలో హామీ ఇచ్చిన విధంగా ప్రైవేటు పాఠశాలల గుర్తింపు గడువును పదేళ్లకు పెంచుతాం. ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని అన్నారు.
ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్లకు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రీ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు అర్హత లేని ఉపాధ్యాయులకు డీఎల్ ఈడీ చేయడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ప్రైవేటు స్కూల్ బస్సులు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి కాలపరిమితి రెండేళ్లు పెంచాలని కోరారు. రాష్ట్రంలో తెలుగు మీడియం ప్రైవేటు పాఠశాలలు 150 వరకు ఉన్నాయని, వాటిని ఇంగ్లీషు మీడియంగా కన్వర్షన్ చేయాలని అభ్యర్థించారు. బడ్జెట్ స్కూల్స్ కు రుణ సదుపాయం కల్పించాలి. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయాలి. ప్రైవేటు స్కూల్స్ ను కేటగిరైజ్ చేసే అంశాలన్ని పరిశీలించాలని సూచించారు. ప్రేవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా శిక్షణ తరగతులు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులతో కలిసి క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలి.
ఇది కూడా చదవండి: AP Crime: కూతురు ప్రేమ వివాహం.. పెళ్లి చేసిన వ్యక్తిని చంపేందుకు భారీ సుపారి!
ఇక పదో తరగతిలో తిరిగి గ్రేడింగ్ సిస్టమ్ ను తీసుకురావాలన్కనారు. ఓపెన్ స్కూల్స్ కు కూడా గుర్తింపు గడువును పదేళ్లకు పెంచాలన్నారు. ముంపు మండలాల్లో ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి. స్కూల్ బస్సుల విషయంలో పన్నుల భారాన్ని తగ్గించాలని కోరారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. \