Indians: శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్...!
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆర్థిక నేరాలపై శ్రీలంక ప్రభుత్వం చర్యలకు దిగింది. ఆన్ లైన్ వేదికగా ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గురువారం ఒక్కరోజే 137 మంది భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో పన్నుల పెంపు నిర్ణయానికి వ్యతిరేకంగా కెన్యాలో తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.దీంతో కెన్యాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని సూచించింది.
హజ్ యాత్రకు వెళ్ళినవారిలో చాలామంది మృత్యువాతను పడుతున్నారు. ఇప్పటిదాకా దాదాపు 1000 మంది చనిపోయారు. ఇందులో 98మంది భారతీయులు ఉన్నట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. మనదేశం నుంచి ఇప్పటివరకు 1.75 లక్షల మంది వెళ్ళినట్లు తెలిపింది.
హజ్ యాత్రలో 600 మందికి పైగా యాత్రికులు చనిపోయినట్లు అధికారులు తాజాగా ప్రకటించారు. వీరిలో 90 మందికి పైగా భారతీయులు చనిపోయినట్లు సమాచారం.సౌదీ అరేబియాలో హజ్ యాత్ర ఈ ఏడాది విషాదాంతగా మారుతోంది.గతంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అధిక సంఖ్యలో యాత్రికులు చనిపోయారు.
మైక్రోసాఫ్ఠ్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా జెరోడా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించన పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా బిల్ గేట్స్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైక్రోసాఫ్ట్ ఈ స్థాయికి ఎదగడానికి భారతీయులే కారణమని బిల్ గేట్స్ అన్నారు.
కంబోడియాలో 300 మంది భారతీయులను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని అక్రమంగా కంబోడియాకు తీసుకుని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో చాలా మంది ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు.
భారత్లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
భారతీయులు తమ ఆహార అలవాట్లను మార్చుకోవాలని సూచిస్తోంది భైదరాబాద్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. చక్కెర, నూనెలు, ప్రొటీన్ సప్లిమెంట్లను తగ్గించాలని చెప్పింది.
భారతీయులు శరీరరంగు దక్షిణాఫ్రికాలతో పోలి ఉంటుంది అన్న కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తెగ మీమ్స్ కూడా వస్తున్నాయి.