TGPSC: గ్రూప్ –2 ఎగ్జామ్ను వాయిదా వేయలేం–హైకోర్టు
తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది.
తెలంగాణలో గ్రూప్–2 పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. వీటిని వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినందువలన వాటిని వాయిదా వేయడానికి కుదరదని తేల్చి చెప్పింది.
గ్రూప్-2 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TGPSC తాజాగా రిలీజ్ చేసింది. ఈ పరీక్షల హాల్టికెట్లను TGPSC తన అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్కు అందుబాటులో ఉంచింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పారాలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్ దీప్తి జీవాంజికి భారీ నగదు బహుమతి అందించారు సీఎం రేవంత్. జీవాంజికి కోటి రూపాయల చెక్ ఇచ్చిన అనంతరం గ్రూప్-2 ఉద్యోగం, వరంగల్లో 500 గజాల స్థలం కేటాయించారు. కోచ్ కు రూ.10లక్షలు ఇచ్చారు.
హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీంతో పోలీసులు అడ్డుకుని అభ్యర్థులపై లాఠీ ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల ప్రక్రియ, పరీక్షల నిర్వాహణ అంశంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జులై 18నుంచి డీఎస్సీ, ఆగస్టు 7,8న గ్రూప్-2 పరీక్షలు జరగనుండగా వీటిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ నిరుద్యోగులకు కోదండరామ్ కీలక హామీ ఇచ్చారు. డీఎస్సీ, గ్రూప్-2 వాయిదా అంశాన్ని టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. పరీక్షలకు కొంత వ్యవధి ఉండేలా అధికారులతో చర్చించామన్నారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పారు.
గ్రూప్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. జులై 5-31 వరకూ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆన్లైన్ గ్రాండ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపింది. జులై 5వరకూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్. అప్లికేషన్ ఎడిట్ అప్షన్ కు సంబంధించిన మార్గదర్శకాలను టీజీపీఎస్సీ విడుదలచేసింది. జూన్ 16-20 సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆగస్టు 7, 8న గ్రూప్ -2 పరీక్ష జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 పరీక్ష హాల్టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://psc.ap.gov.in/ తో మీ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 897 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ ఫిబ్రవరి 25న జరగనుంది.