గ్రూప్-2 పరీక్షలు.. టీజీపీఎస్సీ చైర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

గ్రూప్‌-2 పరీక్షల నేపథ్యంలో టీజపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరీక్షలను 1358 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ OMR షీట్‌ను పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండన్నారు. 

New Update
group 2,,

టీజీపీఎస్సీ గ్రూప్-2 పరీక్షలు డిసెంబర్ 15, 16వ తేదీల్లో అంటే రేపు, ఎల్లుండి జరగనున్నాయి. ఈ తరుణంలో టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం గ్రూప్ 2 అభ్యర్థులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నాం అని అన్నారు. మొత్తం 5.51 లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారని తెలిపారు. గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి 2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేశామని.. గత వారంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల నుంచి కూడా గెలిచాం అని అన్నారు. 

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

1358 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ

ఈ పరీక్షలను 1358 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో దాదాపు 49,848 మంది సిబ్బంది ఉంటారని.. పరోక్షంగా అందరితో కలిపి ఓవరాల్‌గా 75 వేలమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారన్నారు. కాగా రేపు, ఎల్లుండి పరీక్షలు జరగనుండగా.. ఇప్పటి వరకు 75 శాతం మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు.  

ఒక్కో పోస్టుకి 70 మంది

 Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

మొత్తం 783 పోస్టులకు పరీక్ష జరగనుండగా.. ఒక్కొక్కరి ఉద్యోగానికి కనీసం 70 మంది ఉన్నారు. అందువల్ల ఎవరూ ఆందోళన పడవద్దని.. ఆ ఒక్క పోస్ట్ నాదే అనే కాన్ఫిడెన్స్‌తో పరీక్ష రాయండి అని ధైర్యం చెప్పారు. ఎలాంటి అపోహలు వద్దని.. మెరిట్ వచ్చేలా చూసుకోండని పేర్కొన్నారు. అలాగే OMR షీట్‌ను అభ్యర్థులు పక్కాగా చెక్ చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్ లేకుండా పరీక్ష రాసేందుకు వీలు లేదని.. ఏదయినా పరిస్థితిలో పరీక్ష రాసినా అది వ్యాలీడ్ కాదని అన్నారు.

గ్రూప్ 2 గతంలో ఇచ్చినపుడు భర్తీకి 4 ఏండ్ల సమయం పట్టిందని.. 2015 నుంచి 2019 వరకు టైం పట్టిందని అన్నారు. ఈసారి తక్కువ సమయంలో భర్తీ చేస్తున్నామన్నారు. గ్రూప్ 2 కు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్నారు. అభ్యర్థులు TGPSC, మీ మెరిట్‌ను నమ్మండి అని పేర్కొన్నారు. ఎలాంటి అపోహలు లేకుండా ప్రశాంతంగా పరీక్ష రాయండన్నారు. 

ఢిల్లీకి TGPSC సభ్యులు

ఈనెల 18, 19 తేదీల్లో ఢిల్లీకి TGPSC సభ్యులు అంతా కలిసి వెళ్తున్నామన్నారు. 18న ఉదయం UPSC ఆఫీస్‌లో గైడ్ లైన్స్ తీసుకుంటాం అని.. 19 న SSC కమిషన్ ఆఫీస్‌కు వెళ్తున్నాం అన్నారు. సాయంత్రం NTA చైర్మన్ తో భేటీ కానున్నట్లు తెలిపారు. పారదర్శకంగా పరీక్షల నిర్వహణ కోసం అధ్యయనం చేసేందుకు వెళ్తున్నాం అని వివరించారు. 

Also Read: తగ్గేదేలే.. అల్లు అర్జున్ అరెస్టుతో 'పుష్ప2' ఖాతాలో మరో 100కోట్లు   

జనవరి నాటికి ప్రభుత్వానికి దీనిపై నివేదిక అందజేసి తర్వాత రిక్రూట్ మెంట్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతాం అని పేర్కొన్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, UP పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణలో పర్యటించనుందన్నారు. జనవరిలో వారు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. UPSC కేవలం 5 వేల అభ్యర్థుల నియామకాలపై మాత్రమే ఫోకస్ పెడుతోందన్నారు. TGPSC కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్ని సెక్షన్లలో నియామకాలు చేపడుతోందని తెలిపారు. 

TGPSC అంటే కమిట్ మెంట్, స్పీడ్ అనేది అభ్యర్థులకు నమ్మకం కలిగేలా చూస్తాం అన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి వాటిని 6 నుంచి 9 నెలల్లో పరీక్ష ప్రక్రియ పూర్తిచేస్తాం అన్నారు. సింగిల్ పరీక్ష ఉన్నవాటిని 6 నెలల్లోనే భర్తీ చేస్తాం అని తెలిపారు. జనవరి నుంచి మార్చి మధ్యలో గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం అన్నారు. 

Also Read: స్కూళ్లు బంద్‌పెట్టి టీచర్ల దావత్..ప్రభుత్వ అధికారులు సైతం హాజరు

తాను ఇటీవల TGPSC చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నానన్నారు. అయితే పరీక్షల కోసం సిలబస్ మాత్రమె తాము ఇస్తాం అని ఏ పుస్తకాలు చదవాలన్నది తాము చెప్పమని అన్నారు. కొత్త నోటిఫికేషన్లను జాబ్ క్యాలెండర్ ప్రకారం చూసి జనవరి నాటికి కొత్త నోటిఫికేషన్ పై స్పష్టత ఇస్తాం అన్నారు. అరగంట ముందే గేటుకు తాళాలు వేస్తాంఅని.. అభ్యర్థులు గంట ముందే కేంద్రాలకు వెళ్లిపోవాలి పేర్కొన్నారు. తేదీలు క్లాష్ అయితే.. 5 వేలమంది రాసే పరీక్ష కోసం 5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలను ఇరకాటంలో పెట్టలేమన్నారు. 

TGPSC చిన్న సంస్థ.. కానీ రాష్ట్రస్థాయిలో అన్ని నియామకాలు చేపట్టే సంస్థ అన్నారు. అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లపై స్పష్టత ఇచ్చాం అని తెలిపారు. CBT పరీక్ష నిర్వహించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. గ్రూప్ 2 పరీక్షను కూడా CBT విధానంలో నిర్వహించవచ్చు అని తెలిపారు. కానీ 28 వేల మంది రాసేందుకు మాత్రమె అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనివల్ల పరీక్షకు 25 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉందన్నారు. మార్చి నెలాఖరులో గ్రూప్ 2 పరీక్ష ఫలితాలు రిలీజ్ చేస్తాం అని తెలిపారు. TGPSC లో కొత్తగా 80 మందిని డిప్యుటేషన్ విధానంలో తీసుకుంటున్నాం అని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు