Hyderabad: పూజలందుకోవడానికి సిద్ధమైన ఖైరతాబాద్ సప్తముఖశక్తి గణేశుడు
హైదరాబాద్లో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి పండగకు సిద్ధమయ్యాడు. 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో వినాయకుడిని పూర్తిగా పర్యావరణహితంగా తయారు చేశారు. సప్తముఖశక్తి వినాయకుడిగా రేపటి నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నాడు.