లాక్ డౌన్ పై జేపీ నడ్డా సంచలనం | JP Nadda Sensational Comments On Lockdown | RTV
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది. బైడెన్ దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని వైట్ హౌస్ అధికారులు వివరించారు. బైడెన్ ఐసోలేషన్ లో ఉంటూ కోవిడ్ మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు
భారత్ లో కొత్త కోవిడ్ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. మ్యుటేషన్లతో ఆ వేరియంట్లు వ్యాప్తి వేగంగా ఉంది. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని అంటున్నారు.ఇటీవల అమెరికా లో కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కారణమని తెలుస్తోంది.
ప్రపంచ వ్యాప్తంగా తాము తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ను ఉపసంహరించుకుంటున్నామని తెలిపింది బ్రిటన్ ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా. ఈ టీకా వల్ల రక్తం గడ్డ కడుతోందని వరల్డ్ వైడ్గా కేసులు రావడం..బ్రిటన్ కోర్టులో కేసులు నడుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కరోనా వైరస్ చాలా మంది కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చి వెళ్లిపోయింది. ఆనాటి గడ్డు పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికి భయమేస్తుంది.అప్పటి లాక్ డౌన్ నిబంధనలు ఇప్పటికి ప్రజలు మరచిపోరు.కానీ ఇంగ్లాండ్కు చెందిన ఒక కుటుంబం ఇప్పటికీ అదే లాక్డౌన్లో జీవితాన్ని గడుపుతోంది.
కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. దీని కారణంగా ఇప్పటి వరకు నలుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా సోమవారం నాడు మంకీ ఫీవర్ తో 57 ఏళ్ల మహిళ మృతి చెందింది.
కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. నెమ్మదిగా పాత రోజులకు చేరుకుంటామేమోనని ఆందోళన రేకెత్తిస్తోంది. కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవ్వడం మొదలు అయ్యాక ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి నివేదిక విడుదల చేసింది.
భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 761 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అంతకన్నా భయపెట్టే విషయం ఒక్కరోజులోనే 12 మంది మరణించడం.