Corona cases:ఒక్కరోజులోనే 602 కొత్త కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. నిన్కొన ఒక్క రోజులోనే కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తితో ఐదుగురు చనిపోయారు.
దేశంలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. నిన్కొన ఒక్క రోజులోనే కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తితో ఐదుగురు చనిపోయారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలోని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆరుగురు చిన్నారులు కొవిడ్ బారిన పడ్డారు. వారికి ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు.
కరోనా వెనక్కు వచ్చింది...హోమ్ ఐసోలేషన్ కూడా మళ్ళీ వచ్చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినవారు తప్పనిసరిగా 7 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలని ఆదేశించింది.
కరోనా తాజాగా పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ వేరియంట్ అంత ప్రమాదం కాదని నిపుణులు అంటున్నారు. అయితే, వ్యాప్తిని నిరోధించడానికి జాగ్రత్తలు పాటించాలని.. కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని వారు సూచిస్తున్నారు.
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారులు కేసులు పెరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలో 3 కరోనా కేసులు నమోదు అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఏలూరులో ఓ ప్రైవేట్ మెడికల్ వైద్యునికి కొవిడ్ పాజిటివ్ గా వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ఏపీ సీఎం జగన్ అన్నారు.
దేశంలో కోవిడ్ కుసులు బెంబేలెత్తిస్తున్నాయి. మళ్ళీ పాత రోజులు వస్తాయేమో అన్న ఆందోళనను కలిగిస్తున్నాయి. అన్నింటికన్నా ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న ముఖ్య విషయం...ఏడు నెలల తర్వాత కోవిడ్ పాజిటివ్ తో ఆరుగురు ఒకేరోజు చనిపోవడం. దీంతో దేశం మొత్తం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. కొత్త జేఎన్1 న్యూ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకీ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వైరవిహారం చేస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలో 14 నెలల చిన్నారికి కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆక్సిజన్ మీద ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
కరోన కొత్తవేరియంట్ వ్యాప్తిపై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రోగ్యపరమైన అంశాలపై ఎవరకూ రాజకీయం చేయొద్దు. అన్నీ రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి స్థానిక ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని మంత్రి మన్సుఖ్ మాండవీయ సూచించారు.