/rtv/media/media_files/2025/03/18/2Vd6AKJbXkpjblqAOEhp.jpg)
Shreyas Iyer cried in Champions Trophy torny
Shreyas: భారత స్టార్ బ్యాటర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన గతాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్ పంజాబ్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్న శ్రేయస్.. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ కు ముందు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ మేరకు ‘కాండిడ్ విత్ కింగ్స్’ చిట్చాట్లో తాను బాధపడ్డ రోజును తలచుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
నాపై నాకే చాలా కోపం పెరిగింది..
ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దుబాయ్ వేదికగా ఆడిన విషయం తెలిసిందే. అయితే తొలి ప్రాక్టీస్ సెషన్ లో తాను ఏడ్చినట్లు చెప్పాడు. 'బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు బ్యాట్కు బాల్ కనెక్ట్ కావడం లేదు. నాపై నాకే చాలా కోపం పెరిగింది. దీంతో బాధ తట్టుకోలేక ఏడ్చేశాను. నిజానికి నాకు అంత ఈజీగా ఏడుపు రాదు. కానీ ఆరోజు మాత్రం గ్రౌండ్ లోనే ఏడ్చాను. ఎలా ఆడాలని అనుకున్నానో టోర్నీకి ముందే ప్లాన్ చేసుకున్నా. పరిస్థితులను త్వరగా అలవాటు చేసుకుని మ్యాచ్ను బట్టి ఆటతీరు మార్చుకోవాలని నిర్ణయించుకున్నా. మొదటిరోజు ప్రాక్టీస్ సెషన్ ముగిసినా అలాగే చాలాసేపు ప్రాక్టీస్ చేయాలనుకున్నా. కానీ నాకు ఆ అవకాశం రాకపోవడతో చాలా బాధపడ్డాను' అని చెప్పుకొచ్చాడు.
Also Read: ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ రెండు అర్ధశతకాలతో 243 రన్స్ చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ శ్రేయస్ 3 మ్యాచుల్లో 159 పరుగులు చేశాడు. పంజాబ్ రూ.26.75 కోట్లకు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Also Read: Bigg Boss 9: కింగ్కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..
shreyas-iyer | champions-trophy | today telugu news