BIG BREAKING : కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం
కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది
కులగణనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. 2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది
ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం దేశవ్యాప్తంగా కులగణనకు ఆమోదం తెలిపింది. బిహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం నిర్ణయం తీసుకుందని విమర్శలు వస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని ప్రకటించడంతో రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు.
రాబోయే జనాభా లెక్కలతో పాటుగా కులగణన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని, కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని కులగణన మోడీకి మరణశాసనం రాయబోతోందని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం సీఎల్పీ సమావేశంలో రేవంత్ రెడ్డి కీలకవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరవుతున్నాడని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో ఫిబ్రవరి 16-28 మధ్య మరోసారి కులగణన చేయనున్నారు. దీనికోసం టోల్ఫ్రీ నెం. 040-211 11111 ఏర్పాటు చేశారు. ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు సేకరించనున్నారు. MPDO, వార్డు ఆఫీసుల్లో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను ఆఖరి రెడ్డి సీఎం అయినా పర్వాలేదని అన్నారు. కులగణన సర్వే నా కోసం, నా పదవి కోసం చేయలేదని పేర్కొన్నారు. త్యాగానికి సిద్ధపడి కులాల వారిగా లెక్కలు తేల్చామన్నారు.
కాంగ్రెస్ చేసిన కులగణన సర్వే తప్పుల తడక అని ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.అయితే బీసీల జనాభాను తగ్గించి ప్రజలను తీవ్ర మానసిక వేదనకు గురిచేసినందుకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. కులగణన ద్వారా ఐదున్నర శాతం జనాభాను తగ్గించారని అంటే 22 లక్షల మందిని లేనట్లుగా చిత్రీకరించారన్నారు.