/rtv/media/media_files/2025/04/30/9YFJnhyMKtUQd5GODqLY.jpg)
Rahul Gandhi
కేంద్ర ప్రభుత్వం వచ్చే జనాభా లెక్కలతో కులగణన కూడా చేస్తామని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు. కులగణనకు తెలంగాణ ఓ మోడల్గా నిలుస్తుందన్నారు. అలాగే 50 శాతం ఉన్న రిజర్వేషన్ను ఎత్తివేయాలంటూ డిమాండ్ చేశారు. మోదీ సర్కార్.. తమ విధానాన్ని స్వీకరించిందని పేర్కొన్నారు. అలాగే ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నించారు. కుల గణన సర్వేలో తాము కూడా కేంద్రానికి సాయం చేస్తామని తెలిపారు.
Also Read: కశ్మీర్ బోర్డర్లో రాఫెల్ యుద్ధ విమానాలు పెట్రోలింగ్
మరోవైపు సీఎం రేవంత్ కూడా కులగణన నిర్ణయంపై స్పందించారు. రాహుల్ గాంధీ డిమాండ్తోనే దేశవ్యాప్తంగా కులగణనకు కేంద్రం ఒప్పుకుందన్నారు. దేశ ప్రజల అభిప్రాయాన్ని రాహుల్ ఒక్కరే గుర్తించారని అన్నారు. భారత్ జోడో యాత్రలో ప్రజల అభిప్రాయం మేరకే ఆయన దేశంలో కులగణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారన్నారు. అలాగే కులగణనకు అంగీకరించిన ప్రధాని మోదీకి రేవంత్.. కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: కర్రెగుట్టను స్వాధీనం చేసుకున్న బలగాలు.. జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు
ఇదిలాఉండగా బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. త్వరలో జనాభా లెక్కలు జరగనున్నాయని తెలిపారు. వీటితో పాటు కులగణన కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఇప్పటి బీహార్, తెలంగాణ రాష్ట్రాలు కులగణనను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ ఇటీవల పలుమార్లు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. పహల్గాం ఉగ్రాదాడి వల్ల భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ కుల గణన నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
#WATCH | Delhi | "Cabinet Committee on Political Affairs has decided today that Caste enumeration should be included in the forthcoming census," says Union Minister Ashiwini Vaishnaw on Union Cabinet decisions. pic.twitter.com/0FtK0lg9q7
— ANI (@ANI) April 30, 2025
telugu-news | rtv-news | caste-census | national-news | Rahul Gandhi