BIG BREAKING : కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం

కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.  2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.  దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది

New Update
Caste census

కులగణనపై  కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది.  2027, మార్చి 1వ తేదీ నుంచి ఈ కులగణన చేపట్టాలని నిర్ణయించింది. అయితే రెండు దశలుగా కులగణన చేపట్టాలని కేంద్రం భావిస్తోంది.  దీనితోపాటు జనగణనను సైతం చేపట్టాలని చూస్తోంది. 2026, అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ చేపట్టనుంది. ఈ దశలో జమ్మూ కాశ్మీర్‌, లడఖ్, ఉత్తరాఖండ్‌, హిమాచల్ ప్రదేశ్‌లలో చేపట్టనున్నారు. 2027, మార్చి 1 వ తేదీ నుంచి మిగిలిన రాష్ట్రాల్లో ప్రారంభమవుతుంది. కాగా ఏప్రిల్ 30న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కుల గణనను నిర్వహించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read :  అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ - మండిపడుతున్న నెటిజన్లు

Also Read :  మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!

2021లో జనాభా లెక్కలు వాయిదా

 కుల గణనను ప్రత్యేక సర్వేగా నిర్వహించడానికి బదులుగా ప్రధాన జనాభా గణనలో చేర్చాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశంలో సాధారణంగా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరి జనాభా లెక్కలు 2011 సంవత్సరంలో జరిగాయి. దీని తర్వాత, కరోనా మహమ్మారి కారణంగా 2021లో జనాభా లెక్కలు వాయిదా పడ్డాయి. ప్రతిపక్షాలు కుల గణనను నిరంతరం డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కేబినెట్ దీనిని ఆమోదించిన తర్వాత, ప్రతిపక్ష పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. దేశంలో మొదటి జనాభా గణన 1872లో ప్రారంభమైంది.

Also Read :  మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!

Also Read :  ఇవి ఇన్స్టాంట్ బూస్టర్లు.. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి

 

telugu-news | caste-census | new-delhi | enumeration exercise

Advertisment
Advertisment
తాజా కథనాలు