కరెంటు చార్జీల పెంపుపై కేటీఆర్ రియాక్షన్! | KTR Meet Electricity Officer, Hike Electricity Charges
ప్రభుత్వ చర్యలతోనే హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పెయిడ్ పార్కింగ్ ప్రతిపాదన లేదని చెప్పి అకస్మాత్తుగా సెప్టెంబరు 15 నుంచి పెయిడ్ పార్కింగ్ బోర్డులు దర్శనమివ్వడాన్ని ఖండించారు. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ తో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు.