National : గుజరాత్లోనూ బీజేపీని ఓడిస్తాం -రాహుల్ గాంధీ
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్లో కూడా ఓడిస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్కోట్ గేమింగ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను రాహుల్ గాంధీ పరామర్శించారు.
పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వరకూ మొక్కలు నాటాలని జాతీయ స్థాయిలో పార్టీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు విజయవాడలో కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటినట్లు తెలిపారు.
రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్ లో శివుడి విగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఇచ్చిన స్పీచ్ పై బీజేపీ నేతలతో పాటు పలువురు మత పెద్దలు ఫైర్ అవుతున్నారు. రాహుల్ పూర్తి వివరాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కడమే లక్ష్యంగా చేసుకొని మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆరోపించారు. ప్రతిపక్షపార్టీలపై మోదీ ప్రభుత్వం వ్యవహారశైలికి నిరసన తెలుపుతూ పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమికి చెందిన ఎంపీలు ఆందోళనకు దిగారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది. ఇప్పటికిప్పుడే అధ్యక్ష మార్పు వద్దని అధిష్ఠానం భావిస్తోంది. మరో 2 నెలల తర్వాతే బీజేపీ నూతన అధ్యక్షుడి నియామించాలని నిర్ణయించుకుంది.
TG: జనసేనతో పొత్తుపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని అన్నారు. తెలంగాణలో పొత్తుపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.కాగా నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉందని చెప్పిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయుడి దర్శనానికి వచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తాయి అని ఆయన అన్నారు. దీంతో తెలంగాణలోనూ ఏపీ మాదిరిగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పై చర్చ మొదలైంది. విశ్లేషకులు ఈ విషయంలో ఏమంటున్నారో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
TG: మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్ధరాత్రి ఉట్నూర్లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
భర్తల మద్యం అలవాటు మాన్పించాలనుకున్న మహిళలకు మధ్య ప్రదేశ్ మంత్రి నారాయణ్ సింగ్ కుష్వాహా చేసిన ఓ వింత ఘటన హాట్ టాపిక్ గా మారింది.భర్తల మద్యం అలవాటు మాన్పించాలంటే వారిని ఇళ్లలోనే మద్యం సేవించమని చెప్పాలని మహిళలకు తెలిపారు.