హిందువుల మనోభావాలను గాయపర్చారు..వారిని భగవంతుడు క్షమించడు–బండి సంజయ్

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హిందువుల మనోభావాలను గాయర్చిన వారిని భగవంతుడు ఎప్పటికీ క్షమించడంటూ ఆయన తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

author-image
By Manogna alamuru
New Update
minister

Tirmala Laddu Issue:

ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూల జంతువుల ఫ్యాను ఉపయోగిస్తారా...ఇది పద్ద మోసం. క్షమించరాని నేర అంటూ మండిపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. టీటీడీ బోర్డ్ గొండితనం, నేరపూరిత స్వభావం ఇది అంటూ దుయబట్టారు. తాము ఇంతకు ముందే తిరుమలో మిగతా మతస్థుల ఇన్వాల్వ్‌మెంట్ గురించి కంప్లైంట్ చేశామ. దాని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇది వారిపనే అంటూ బండి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమ స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కోరారు. ఈ చర్య వెనుక ఎవరున్నారు, ఏం జరుగుతోంది లాంటి అసలు నిజాలను బయటకు తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం కాపాడాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Nizamabad: వాటర్ హీటర్ షాక్ కొట్టి వ్యక్తి అక్కడిక్కడే మృతి

Advertisment
తాజా కథనాలు