Assam: అస్సాంలో కొనసాగుతున్న వరద.. 106 మంది మృత్యువాత
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతోంది. దీంతో అక్కడ జనజీవనం అస్తవ్యస్తం అయింది. వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 106మంది మరణించారు. లక్షల సంఖ్యలో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
అస్సాం శివసాగర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రవర్తన మార్చుకోమని మందలించాడని ప్రిన్సిపాల్ రాజేష్ను ఓ విద్యార్థి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. హత్య చేయడంతో పాటు ఆన్లైన్ ద్వారా తానే చేశానని విద్యార్థి చెప్పాడు. ఒంగోలుకి చెందిన మృతుడు రాజేష్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు వణకుతున్నాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.అస్సాంలో భారీ వర్షాల వల్ల కజిరంగా నేషనల్ పార్క్లోని 131 జంతువులు మృతి చెందగా, 96 జంతువులను కాపాడినట్లు అధికారులు తెలిపారు.
వరదల కారణంగా అస్సాంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం తాజాగా ఆరుగురు మృతి చెందారు.వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాను కారణంగా మరణించిన వారి సంఖ్య 62 కి చేరింది. 29 జిల్లాల్లో 21 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
అసోం లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆరున్నర లక్షల మంది వరదల బారిన పడ్డారు.బ్రహ్మపుత్ర దాని ఉపనదులకు వరదలు భారీగా వచ్చి చేరటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి సహాయక శిబిరాలలోని నిరాశ్రయులను సీఎం హిమంత బిస్వా పరామర్శించారు.
రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోని 9 జిల్లాల్లో కురుసిన భారీ వర్షాలకు రోడ్లు,భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరశ్రాయులైయారు.
లోక్సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్ శుక్రవారం ప్రారంభం కానుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అస్సాంలోని ఓ రాజకీయ నేత బెంజమిన్ బసుమతరీ నోట్లు వేసి వాటిపై పడుకున్న ఫొటోలు వైరల్ కాగా ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన బసుమతరీ అది ఐదేళ్ల క్రితం నాటి ఫొటో అని.. అప్పు తెచ్చిన డబ్బుతో సరదాకి అలా చేశానని చెప్పారు.
పక్షులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటన ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అసోంలోని జటింగా గ్రామంలో సెప్టెంబర్ లో స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరిగా మారిందని పరిశోధకులు వెల్లడించారు. రహస్య శక్తి ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.