Alcohol: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా ?

మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. ఆ తర్వాత మేఘాలయ, అస్సాం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

New Update
Woman Drinking Alcohol

Woman Drinking Alcohol

మద్యం సేవించే అలవాటు ఒకప్పుడు పరుషుల్లో మాత్రమే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆడవాళ్లలో కూడా మద్యం తాగే అలవాటు ఉన్నవారి సంఖ్య పెరుగుతోంది. అయితే దేశంలో ఏయే రాష్ట్రాల్లో మద్యం ఎక్కువగా తీసుకుంటున్నారు ? మద్యం తాగే మహిళలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నారు ? వంటి కోణాల్లో  కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవల సర్వే నిర్వహించింది. ఇప్పుడు ఈ సర్వే వివరాల గురించి తెలుసుకుందాం. 

Also Read: రండి.. రండి.. పానీ పూరీ తింటే రూ.21 వేల ప్రైజ్‌మనీ.. ఎగబడుతున్న కస్టమర్స్!

దేశంలో మహిళలు మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలు ముందున్నాయని సర్వేలో తేలింది. ఇక మహిళల్లో చూసుకుంటే.. మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని తేలింది. దేశంలో 15 నుంచి 49 ఏళ్ల వయస్సు గల మహిళల్లో సగటు మద్యపానం 1.2 శాతం ఉంది. అయితే అస్సాంలో ఈ సగటు 16.5 శాతానికి దగ్గరగా ఉంది. 

Also Read: డేంజర్ జోన్‌లో ఇండియా.. అణబాంబు కంటే 500 రెట్ల వినాశనం!

అస్సాం తర్వాత మహిళలు ఎక్కువగా మద్యం సేవించే రాష్ట్రంగా మేఘాలయ నిలిచింది. అక్కడ 8.7 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నట్లు తేలింది. ఇక అరుణాచల్‌ ప్రదేశ్‌ మూడో స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ 3.3 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి వీళ్ల సంఖ్య కాస్త తగ్గింది. ఆ తర్వాత సిక్కిం(0.3 శాతం) , ఛత్తీస్‌గఢ్ (0.2 శాతం) ఉన్నాయి.  ఇదిలాఉండగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇటీవలే దీని గురించి తెలుసుకునేందుకు ఇటీవలే సర్వే నిర్వహించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సర్వే వివరాలు వెల్లడయ్యయి.    

Also Read: మోదీ మాటలకే పరిమితం.. AI విషయంలో ఫెయిల్: రాహుల్ గాంధీ

Also Read: భూమిపైకి వచ్చాక సునీతా విలియమ్స్‌కు ఎదురుకానున్న ఇబ్బందులు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు