🔴Live News: హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచడానికి విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయడు వినూత్న రీతిలో ప్రోత్సాక బహుమతి ప్రకటించారు. 3వ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగ పిల్లాడైతే ఆవు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆఫర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
బీజేపీ హైకమాండ్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పేరును ఖరారు చేసింది. సోము వీర్రాజు గతంలోనూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఈరోజు ఆయన నామినేషన్ వేయనున్నారు.
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఖరారు చేశారు.
అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులపై మాట్లాడారు. అయితే మధ్యలో ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తెలుగులో మాట్లాడమని సలహా ఇచ్చారు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
అన్నమయ్య జిల్లా రాజంపేట జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు అధికారులు ఆయన్ను రాజంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా పోసానికి నిన్న కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మార్చిలోగా నామినేటెడ్ పదవుల భర్తీ, మేలో జరగనున్న మహానాడు నాటికి పార్టీ కమిటీలు పూర్తి చేస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం ఎమ్మెల్యేలతో తిరిగే వాళ్లకి కాకుండా పార్టీ కోసం కష్టపడ్డవారిని ఎంపిక చేయాలన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.వైఎస్ సునీత, సీబీఐ ఏఎస్పీ రాంసింగ్ బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవి తప్పుడు ఆరోపణలంటూ పోలీసులు కేసు నమోదు చేయగా కోర్టు కొట్టేసింది.