Rahul Gandhi: రాహుల్గాంధీపై పరువు నష్టం కేసు విచారణ వాయిదా
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నమోదైన పరువు నష్టం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీన చేస్తామని కోర్టు తెలిపింది. 2018లో కర్ణాటక ఎన్నికల సమయంలో అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాహుల్పై పరువు నష్టం కేసు నమోదైంది.