Amarnath Yatra: అమర్నాథ్ యాత్రకు తొలి రోజు @13,000మంది
అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. తొలి రోజైన శనివారం అమర్నాథ్ గుహాలయంలోని స్పటిక శివలింగాన్ని 13 వేల మంది దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. యాత్ర సందర్భంగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా భక్తులకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.