Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు.  వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది.  

New Update
J-K's Pahalgam

J-K's Pahalgam

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.  బైసరన్ లోయలో పర్యాటకుల బృందాన్ని  లక్ష్యంగా చేసుకుని  కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మందికి బుల్లెట్ గాయాలు కాగా ఇందులో  ఆరుగురు పర్యాటకుల పరిస్థితి విషమంగా ఉంది. వారిలో ముగ్గురు స్థానికులు, ముగ్గురు స్థానికేతరులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Also read : Chennamaneni Ramesh : చెన్నమనేని రమేష్కు మరో బిగ్ షాక్.. CID కేసు నమోదు!

విచక్షణారహితంగా కాల్పులు

పహల్గామ్‌లో ట్రెక్కింగ్ కోసం వచ్చిన పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. అమర్‌నాథ్ యాత్రకు కొద్దిసేపటి ముందు ఈ దాడి జరగడం కలకలం రేపింది. అమర్‌నాథ్ యాత్ర భద్రత గురించి ప్రశ్నలు తలెత్తాయి. కాగా జమ్మూకాశ్మీర్‌లో పహల్గామ్ టూరిస్ట్ ప్రాంతాలలో ఒకటి, ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు.  ఈ ప్రాంతానికి కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు.

Also read : ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

Also Read: గూగుల్‌ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు