Cricketer Divorce: విడాకులకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

టీమిండియా క్రికెటర్ మనీష్ పాండే, అతని భార్య అశ్రిత శెట్టి కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరు విడిపోతున్నట్లు సమాచారం. ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో పాటు ఇద్దరు ఉన్న ఫొటోలు డిలీట్ చేశారు.

New Update
Manish pandey-Ashrita shetty

Manish pandey-Ashrita shetty Photograph: (Manish pandey-Ashrita shetty)

టీమిండియా (Team India) క్రికెటర్ యుజువేంద్ర చాహల్, ధన్‌శ్రీ వర్మ విడాకులు (Divorce) తీసుకుంటున్నారని ఈ మధ్య కాలంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ ఫాలో చేసుకోవడం, కలిసి ఉన్న ఫొటోలు డిలీట్ చేయడంతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మరో టీమిండియా క్రికెటర్ కూడా విడాకులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి:  Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం..

ఫొటోలు డిలీట్ చేయడం..

స్టార్ జోడి అయిన మనీష్ పాండే (Manish Pandey), అతని భార్య అశ్రిత శెట్టి (Ashrita Shetty) కూడా విడాకులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత విషయాల వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు సమాచారం. వీరిద్దరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే ఇద్దరు ఉన్న ఫొటోలను వారి ఖాతా నుంచి డిలీట్ చేశారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విడాకులపై మనీష్ పాండే, అశ్రిత శెట్టి ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ జంట స్పందిస్తేనే దీనిపై క్లారిటీ వస్తుంది. 

ఇది కూడా చూడండి:  Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే

మనీష్ పాండే, అశ్రిత శెట్టి 2019 లో పెళ్లి చేసుకున్నారు. తమిళ సినిమాల్లో నటించిన అశ్రిత ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మైదానంలో కనిపించేది. అయితే ఐపీఎల్ 2024 నుంచి స్టేడియంలో కనిపించలేదు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మనీష్ పాండే ఉన్నాడు. ఈ జట్టు గతేడాది టైటిల్ కూడా గెలుచుకుంది. ఈ సమయంలో కూడా అశ్రిత ఎలాంటి పోస్ట్ సోషల్ మీడియాలో చేయలేదు. 

ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు