/rtv/media/media_files/2025/05/09/sKEo0v2DhZjBF1yvJUGy.jpg)
match called Off in Dharmasala
నిన్న ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీల మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. భద్రతా కారణాల రిత్యా ఆటను సగంలో ఆపేశారు. స్టేడియం సమీప ప్రాంతాల్లో వాయు దాడులు జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ముందు నుంచే మ్యాచ్ జరగడం మీద అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ ఎలా అయితేనేం మ్యాచ్ మొదలెట్టారు. అయితే రాత్రి పాకిస్తాన్ దాడులు ఎక్కువ అవడంతో మ్యాచ్ ను మధ్యలో రద్దు చేశారు. పంజాబ్ 10.1 ఓవర్లలో ఒ వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది. అక్కడ కరెక్ట్ గా మ్యాచ్ ఆగిపోయింది. దీని తరువాత వెంటనే ప్లేయర్లను అక్కడ నుంచి తరలించారు. స్టేడియంను కూడా ఖాళీ చేయించారు.
Also Read : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. మ్యాచ్ రద్దు
లైట్లను ఆపేసి...
మ్యాచ్ ఆగిపోయిన తర్వాత స్టేడియంను ఖాళీ చేయించడంలో బీసీసీఐ చాకచక్యంగా వ్యవహరించింది. మొదట ఫ్లడ్ లైట్లను ఆపేశారు. సాంకేతిక కారణాల వలన లైట్లు ఆగిపోయినట్లు చెప్పారు. తరువాత 18 వేలమంది ప్రేక్షకులను, ప్లేయర్లను స్టేడియం నుంచి ఖాళీ చేయించారు. ప్రేక్షకులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. లేకపోయి ఉంటే తొక్కిసలాట జరిగి ఉండేదని బీసీసీఐ చెప్పింది. ఆటగాళ్లను జాగ్రత్తగా, సురక్షితంగా స్టేడియం నుంచి తరలించాం అని హిమాచల్ క్రికెట్ సంఘం అధికారి ఒకరు చెప్పారు.
Also Read : రాయల్స్ జట్టులోకి ఇద్దరు సౌతాఫ్రికా స్టార్లు.. రచ్చ రచ్చే!
అత్యంత జాగ్రత్తగా క్రికెటర్లను..
ఆట ఆగిపోయాక క్రికెటర్లను అత్యంత జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. విమానాల్లో కాకుండా...రోడ్డు, రైలు మార్గాల ద్వారా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసింది. కొంత దూరం రోడ్డు మార్గం ద్వారా..అక్కడి నుంచి ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ప్రసార సిబ్బందిని ప్రత్యేక రైలులో వేరే ప్రాంతానికి తరలించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. భద్రతా కారణాల వలన ధర్మశాల , చుట్టుపక్కల ప్రాంతాల్లో విమానాశ్రయాలను మూసివేశారు.
Also Read : IPL షెడ్యూల్లో కీలక మార్పు.. అభిమానులకు బిగ్ షాక్!
ఐపీఎల్ ఇక జరగకపోవచ్చును...
ఈ సీజన్ ఐపీఎల్ ఇక జరగకపోవచ్చని అంటున్నారు. ఇందులో మనదేశ ఆటగాళ్ళే కాకుండా...ఇతర దేశస్థులు కూడా ఉండడం...వారి సెక్యూరిటీ అన్నీ పరిగణనలోకి తీసుకుని ఐపీఎల్ ను రద్దు చేయొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఐపీఎల్ ను కొనసాగించడం కష్టమేనని బీసీసీఐ కూడా భావిస్తోంది. సీజన్ కొనసాగించడం కంటే ఆటగాళ్ళ భద్రత ముఖ్యమని భావిస్తోంది. ఈరోజు బీసీసీఐ సమావేశం జరగనుంది. ఇందులో ఐపీఎల్ కొనసాగించడంపై నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read : రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ ఫార్మట్ కు గుడ్ బై!
today-latest-news-in-telugu | IPL 2025 | dc | PBKS | match