/rtv/media/media_files/2025/05/08/OTaFDPglEzWiMGTcyWgc.jpg)
pbks mi Photograph: (pbks mi)
Ind-pak war: ఇండియా, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం వేళ IPLలో షెడ్యూల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మే 11న ధర్మశాలలో జరగాల్సిన MI vs PBKS మ్యాచ్ వేదికను బీసీసీఐ మార్చినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు రోజులు ధర్మశాల విమానాశ్రయాన్ని మూసివేశారు. ముంబై టీమ్ ధర్మశాలకు చేరుకోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వేదికను మారుస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
The many colours of IPL 🎨
— IndianPremierLeague (@IPL) May 8, 2025
From the eyes of Painter Andy Brown 🧑🎨
Presenting - 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗮𝗻𝗱 𝗖𝗮𝗻𝘃𝗮𝘀 ft. #TATAIPL 🌄
WATCH the full video 🎥 🔽 -By @mihirlee_58 | #PBKSvDChttps://t.co/EfOvuYOD86 pic.twitter.com/wtbw0VMNMS
ఈ అంశంపై ఓ బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ... ‘ముంబై, పంజాబ్ మ్యాచ్ ముంబైలో జరిగే అవకాశాలు ఉన్నాయి’ అని హింట్ ఇచ్చారు. మరోవైపు.. ‘బీసీసీఐ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు రాలేదని, మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ సంఘం చెబుతోంది. అధికారికంగా చెప్పనంత వరకు షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్తామని స్పష్టం చేసింది.
IPL 2025 | telugu-news | today telugu news