/rtv/media/media_files/2025/05/08/ysSw4Ue4scFSEvdY4WO1.jpg)
IPL 2025 Rajasthan Royals: ఐపీఎల్ 2025 సీజన్లో ఇరుజట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ ఏడాది సీజన్లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) పేవలమైన ప్రదర్శన చేస్తుంది. మొత్తం 12 మ్యాచ్లు ఆడిన ఈ జట్టు 9 మ్యాచ్లు ఓడిపోయి.. కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. దీంతో 6 పాయింట్లతో 9వ స్థానంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
Rajasthan Royals
ఇక ఈ జట్టుకు ఇంకో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ రెండు మ్యాచ్ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆర్ఆర్ జట్టు చూస్తుంది. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి గాయాల కారణంగా ఆర్ఆర్ జట్టు ప్లేయర్లు.. బ్యాటర్ నితీశ్ రాణా(Nitish Rana), బౌలర్ సందీప్ శర్మ(Sandeep Sharma) లీగ్ నుంచి తప్పుకున్నారు.
Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్పై ఖర్గే సంచలన కామెంట్స్!
తాజాగా వారి స్థానాలను ఆర్ఆర్ జట్టు యాజమాన్యం భర్తీ చేసింది. ఇదే విషయాన్ని ఐపీఎల్ వర్గాలు తాజాగా తెలిపాయి. ఇందులో భాగంగా నితీశ్ రాణా ప్లేస్లో సౌతాఫ్రికా బ్యాటర్ లువాన్ డే ప్రిటోరియస్ను రంగంలోకి దించింది. ఇతడిని మెగా వేలంలో రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ బ్యాటర్ టీ 20ల్లో 33 మ్యాచ్లు ఆడి 911 పరుగులు సాధించాడు.
Also Read: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్
మరోవైపు బౌలర్ సందీప్ శర్మ కూడా గాయం కారణంగా తప్పుకున్నాడు. అతడు 10 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీశాడు. ఇటీవల అతడి చేతికి తీవ్ర గాయం కావడంతో ఈ సీజన్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు సందీప్ శర్మ ప్లేస్లో రాజస్తాన్ యాజమాన్యం సౌతాఫ్రికాకు చెందిన పేసర్ నాండ్రే బర్గర్ను రంగంలోకి దించింది. కాగా ఇతడిని వేలంలో రూ.3.5 కోట్లకు కొనుగోలు చేశారు.
Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!
IPL 2025 | latest-telugu-news | telugu-news | Rajasthan Royals