/rtv/media/media_files/2025/09/26/ind-vs-pak-2025-09-26-06-13-56.jpg)
ఆసియా కప్ 2025 లో ఫైనలిస్టులు(Asia Cup Final 2025) ఖరారయ్యాయి. సెప్టెంబర్ 28 ఆదివారం రోజున జరిగే ఫైనల్లో టీమ్ఇండియా(team-india), పాకిస్థాన్(pakistan) తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియాకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది, గ్రూప్ దశలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై రెండు విజయాలు , సూపర్ 4లో కూడా విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది. మరోవైపు ఓవరాల్గా భారత్, పాక్ రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ -2007, ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో తలపడగా చెరో విజయం సాధించాయి.
A historic Sunday awaits: Pakistan and India are set to meet in their first Asia Cup final, marking the third straight weekend they face each other pic.twitter.com/xfuM3SYJWR
— ESPNcricinfo (@ESPNcricinfo) September 25, 2025
Also Read : పహల్గాం దాడిపై వ్యాఖ్యలు... భారత కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ
11 పరుగుల తేడాతో విజయం
ఇక బంగ్లాదేశ్(bangladesh) తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 11 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది. 20 ఓవర్లలో 135/8 రన్స్ చేసింది. 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో మహమ్మద్ హారిస్ (31), షాహీన్ అఫ్రిదీ (19), నవాజ్ (25) పాక్ను ఆదుకున్నారు. బంగ్లా బౌలర్ టస్కిన్ అహ్మద్ 3 వికెట్లతో సత్తా చాటారు. 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ చతికిల పడింది. 9 వికెట్లకు 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. షహీన్ షా అఫ్రిది (3/17), రవూఫ్ (3/33) సైమ్ అయూబ్ (2/16) కట్టుదిట్టమైన బౌలింగ్తో బంగ్లాను దెబ్బతీశారు. షమిమ్ (30) పోరాటం చేసిన ఫలితం దక్కలేదు.
For the first time in 17 editions of the Asia Cup
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) September 25, 2025
India & Pakistan are set to face each other in the final.#AsiaCup2025pic.twitter.com/ZT6X8X04a7
Pakistan (135/8) beat Bangladesh (124/9 in 20 overs) by 11 runs in Super Four match, to face India in Asia Cup 2025 finalhttps://t.co/FfrpeUODolpic.twitter.com/6UqxgZMUBB
— CricketNDTV (@CricketNDTV) September 25, 2025
ఆసియాకప్లో ఫైనల్ చేరిన టీమ్ఇండియా ఇవాళ సూపర్-4లో శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. బ్యాటింగ్, బౌలింగ్లో సత్తా చాటుతున్న భారత జట్టు పాక్ తో తుది పోరుకు ముందు ఫీల్డింగ్లో వైఫల్యాలను అధిగమించాల్సి ఉంది. మరోవైపు 2 మ్యాచుల్లో ఓడిన శ్రీలంక నుంచి ఎలాంటి పోటీ ఎదురవుతుందో చూడాలి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు మొదలుకానుంది.
Also Read : దేశం కోసం విలన్ పాత్రలు కూడా చేస్తా.. బ్యాంటింగ్ ఆర్డర్ పై శాంసన్ కీలక కామెంట్స్