/rtv/media/media_files/2025/04/27/H0WCioX2wlL4gCPxsenJ.jpg)
Dinesh Karthik sweet warning to Delhi captain Axar Patel
IPL 2025: ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్కు బెంగళూర్ మెంటార్ దినేశ్ కార్తిక్ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అక్షర్.. డీకేను చూడగానే ఆపేసి పలకరించాడు. దీంతో ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయి.. జోక్ చేయొద్దని డీకే హెచ్చరించాడు. ఈ మేరకు ఢిల్లీ వేదికగా అరుణ్ జైట్లీ స్టేడియంలో సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నెట్స్లో అక్షర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. అప్పుడే అటువైపుగా దినేష్ కార్తిక్ రావడంతో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
DK bhai se milne ke liye sab ruk sakta hai 🫂🫶 pic.twitter.com/0mHThRPXRI
— Delhi Capitals (@DelhiCapitals) April 26, 2025
Also Read : మహేష్ బాబు ఈడీ కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన లేఖ రాసిన హీరో!
Also Read : 'ఇండియాలోని ఆ ఎయిర్పోర్టును పేల్చేస్తాం'
మంచి కెప్టెన్ గా ఉండు..
నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న అక్షర్.. ‘నా బ్రదర్ డీకేకు హాయ్ చెప్పేందుకు వచ్చాను’ అని అన్నాడు. దీంతో వెంటనే 'మంచి కెప్టెన్ గా ఉండు' అని కార్తిక్ చెప్పాడు. 'మీరు నాకు అన్నలాంటివారు. అందుకే విష్ చేయడానికి వచ్చాను' అని అక్షర్ అన్నాడు. మళ్లీ వెంటనే 'ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయి. జోక్ చేయొద్దు. అందుకే నేను నెట్స్ దగ్గరకు రాను' అంటూ డీకే అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
Royal Challenge Packaged Drinking Water Moment of the Day 📸
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 27, 2025
The Royal Challengers, all geared up to #PlayBold! 💪#ನಮ್ಮRCB #IPL2025 pic.twitter.com/TqjibAV4dz
Also Read : పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్ చేస్తూ పోస్టులు.. 19 మంది అరెస్టు
ఇదిలా ఉంటే.. ఈ గ్రౌండ్ ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ హోంగ్రౌండ్. అతడి పేరిట ఓ స్టాండ్ ఉంది. అయితే ఇటీల బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ -వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరిగింది. ఢిల్లీ విజయం సాధించగా కేఎల్ రాహుల్ భారీ సంబరాలు చేసుకున్నాడు. 'ఇది నా అడ్డా' అంటూ బ్యాట్తో మైదానంలో సర్కిల్ గీసి కాంతారా స్టైల్లో రెచ్చిపోయాడు. ఇప్పుడు కేఎల్పై విరాట్ తనదైన శైలిలో ‘రివెంజ్’ తీర్చుకుంటాడని మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
Also Read : టాస్ గెలిచిన పంత్.. ముంబై బ్యాటింగ్!
bengalore | telugu-news | today telugu news