Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్‌ చేస్తూ పోస్టులు.. 19 మంది అరెస్టు

పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఇలా పోస్టులు చేసిన 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

New Update
Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack

Student, Retired Teachers, Lawyer Among 19 Arrested For Remarks On J&K Attack

పహల్గాం ఉగ్రదాడి ఘటన జరిగినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ అంశమే ట్రెండింగ్‌ అవుతోంది. చాలామంది నెటిజన్లు దీనికి సంబంధించిన పోస్టులు చేస్తున్నారు. ఈ ఉగ్రదాడిని ఖండిస్తూ.. పాక్‌కు బుద్ధి చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే కొంతమంది పహల్గాం ఉగ్రదాడిపై వివాదాస్పద పోస్టులు చేశారు. దీంతో ఇలా పోస్టులు చేసిన వాళ్లని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా 19 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన వాళ్లుగా గుర్తించారు. వీళ్లలో విద్యార్థులు, రిటైర్డ్‌ టీచర్లు, లాయర్లు కూడా ఉన్నారు.

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

Pahalgam Attack On Jammu & Kashmir

పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్రం ఇప్పటికే సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది. పహల్గాం టెర్రర్ అటాక్‌కు ఎవరైనా మద్దతు పలికేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇటీవల పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పలువురు స్లోగన్స్ చేశారు. ఇలా చేసిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన 19 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాదు ఈ19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వాళ్లేనని గుర్తించారు. 

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

మరోవైపు ఈ అరెస్టులు, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందిచారు. పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా, దేశానికి వ్యతిరేకంగా పోస్టులు చేసిన వాళ్లపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వాళ్లపై వీలైతే జాతీయ భద్రతా చట్టంలోని రూల్స్‌ను విధిస్తామని తెలిపారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఎలాంటి సంబంధాలు లేవని.. ఇరు దేశాలు శత్రు దేశాలని అన్నారు. 

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

telugu-news | rtv-news | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు