Dilip Doshi: గుండెపోటుతో భారత మాజీ క్రికెటర్ కన్నుమూత!

భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేసింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన దిలీప్ 238 FC మ్యాచుల్లో 898 వికెట్లు తీశారు.

New Update
Former India spinner Dilip Doshi passes away

Former India spinner Dilip Doshi passes away

భారత మాజీ క్రికెటర్ దిలీప్ దోషి 77 ఏళ్ల వయసులో లండన్‌లో మరణించారు. ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దిలీప్ దోషి మృతి పట్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ పోస్టు పెట్టింది. ‘‘భారత మాజీ స్పిన్నర్ దిలీప్ దోషి దురదృష్టవశాత్తూ లండన్‌లో మరణించడం పట్ల బీసీసీఐ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని బీసీసీఐ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసింది. 

Also Read: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి.. 350కి పైగా డ్రోన్లతో కాల్పులు

Dilip Doshi Died

Also Read: అమెరికా మరో సంచలన నిర్ణయం..  ఇమ్మిగ్రెంట్‌ వీసాల కోసం బిగ్ అలెర్ట్!

ఇదిలా ఉంటే దోషి టెస్ట్ క్రికెట్‌లోకి ఆలస్యంగా వచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ దోషి 32 ఏళ్ల వయసులో భారత్ తరఫున అరంగేట్రం చేశారు. భారతదేశం తరపున 33 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 114 వికెట్లు పడగొట్టాడు. అలాగే దోషి 15 వన్డేల్లో 22 వికెట్లు తీశాడు. 

Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!

దేశీయ క్రికెట్‌లో చాలా అద్భుతంగా రాణించారు. 1968లో ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి 1986 వరకు.. అంటే పదవీ విరమణ చేసే వరకు ఆ ఫార్మాట్‌లో ఆడారు. ఇలా ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 238 మ్యాచ్‌లు ఆడి 898 వికెట్లు పడగొట్టారు. 

Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్‌ సంచలన హెచ్చరిక

 

latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news | team-india-cricketers

Advertisment
Advertisment
తాజా కథనాలు