/rtv/media/media_files/2025/06/23/us-visa-2025-06-23-19-02-25.jpg)
అమెరికా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. F, M, J నాన్ - ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి అమెరికా బిగ్ అలర్ట్ జారీ చేసింది. మూడు రకాల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తుదారులు చేసుకునే వారు తమ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ మోడ్కు సెట్ చేసుకోవాలని తెలిపింది. అంటే సోషల్మీడియా అకౌంట్స్ ప్రైవసీలో ఉంచితే అమెరికాలోకి నో ఎంట్రీ అనే కండీషన్ ను పెట్టిందన్నమాట. వెంటనే సోషల్మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలని సూచించింది. అంతేకాకుండా సోషల్ మీడియా అకౌంట్స్ సెట్టింగ్స్లో మార్పులు చేయాలంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికా ప్రకటించింది.
2019 నుండి వలసదారులు
యూఎస్ వీసా ప్రివిలేజ్ మాత్రమే, హక్కు కాదంది అమెరికా. యూఎస్లో ఎంట్రీకి అర్హత లేని వారిని గుర్తించేందుకు వీసా స్క్రీనింగ్, వెట్టింగ్ ను చేపట్టింది. 2019 నుండి వలసదారులు, వలసేతర వీసా దరఖాస్తులపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని అమెరికా దరఖాస్తుదారులను ఆదేశించిందని కూడా తెలిపింది. కాగా గత నెలలో సోషల్ మీడియాలో వారి కార్యకలాపాల స్క్రీనింగ్ను విస్తరించడానికి సిద్ధమవుతున్నందున, దేశంలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల కోసం కొత్త వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ను యుఎస్ పరిపాలన తాత్కాలికంగా నిలిపివేసింది.
Effective immediately, all individuals applying for an F, M, or J nonimmigrant visa are requested to adjust the privacy settings on all of their social media accounts to public to facilitate vetting necessary to establish their identity and admissibility to the United States… pic.twitter.com/xotcfc3Qdo
— U.S. Embassy India (@USAndIndia) June 23, 2025
విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీ పౌరుల కోసం గతంలో నిలిపివేయబడిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తున్నట్లు జూన్ 18న యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. దరఖాస్తుదారులందరూ ఇప్పుడు వారి సోషల్ మీడియా ఖాతాలకు యాక్సెస్ను అందించాల్సి ఉంటుంది. స్టూడెంట్ లేదా పర్యటక వీసాపై వచ్చేవారు మాదకద్రవ్యాలు తీసుకోవడం లేదా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో వీసాకు అనర్హులవుతారని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఇటీవల పేర్కొంది.