/rtv/media/media_files/2025/05/29/UdWvrYcKK91S7Qzti39g.jpg)
PM Modi and CM Mamata Benarjee
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీ సర్కార్పై తీవ్రంగా విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో అవినీతి, హింస ఉందంటూ ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై కన్నీళ్లు పెట్టుకుంటున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వాన్న మార్చాల్సిన సమయం వచ్చిందని ప్రజలు కూడా భావిస్తున్నారని పేర్కొన్నారు. మోదీ వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
Mamata Banerjee's 'Poll Battle
ప్రధాని మోదీలో తాను మాట్లాడలేనని.. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏంటో తెలస్తుందని కౌంటర్ ఇచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారో తేలుతుందంటూ పేర్కొన్నారు. '' ఎన్నికలు రాని.. అప్పుడు చూసుకుందాం. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో చూద్దాం. మా వెంట, పార్టీ వెంట రాష్ట్ర ప్రజలు ఉన్నారని నేను బలంగా నమ్ముతున్నానని'' మమతా బెనర్జీ.. మోదీకి సవాల్ విసిరారు.
Also Read: కూతురిపై తండ్రి అత్యాచారం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఇదిలాఉండగా గురువారం ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్లోని అలీపుర్దౌర్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఎక్కడా చూసిన అవినీతి, హింస ఇవే కనిపిస్తున్నాయని నిలదీశారు. ఇక పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో పట్టుకోసం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. కానీ అది ఫలించడం లేదు. మూడుసార్లు వరుసగా టీఎంసీ పార్టీయే అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్లో జెండా పాతాలని బీజేపీ గట్టి పట్టు మీద ఉంది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
Also Read: సొంత దేశం ఇజ్జత్ తీసిన పాకిస్తాన్ నటి.. వైరల్ వీడియో
rtv-news | modi | mamata-benarjee