/rtv/media/media_files/2025/05/29/wxqbv8WHtg6oPWgGpF2X.jpg)
పాకిస్తాన్ పరువు తీసింది ఆ దేశానికి చెందిన నటి. ప్రజలకు నీళ్లు అందించలేని ప్రభుత్వం బయటకు గొప్పలు చెప్పుకొని ర్యాలీలు తీస్తుందని ఆమె అన్నారు. పాకిస్తానీ నటి హీనా బయాత్ అక్కడి ప్రభుత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వాష్రూమ్లలో నీళ్లు రావడం లేదని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పాక్ గవర్నమెంట్కు చురకలు అంటించారు. దీంతో ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: కరోనా పేషేంట్ ని చంపేయ్.. ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకున్న ఆడియో వైరల్!
Pakistani Actress Video Of Karachi Airport
Taps run dry in all washrooms of Karachi International airport making it challenging for all passengers, laments Pakistani actor Hina Bayat pic.twitter.com/721K4w6yVZ
— Yeshi Seli (@YeshiSeli) May 29, 2025
Also Read: పాక్ ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. భారత్పై మరోసారి విద్వేష ప్రసంగం
ఓ పక్క నీళ్లు లేక ప్రజలు బాధపడుతుంటే ప్రభుత్వం ర్యాలీలు చేస్తోందని హీనా బయాత్ ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ లాహోర్లో భారత్కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించింది అక్కడి ప్రభుత్వం. ఈరోజు పాకిస్తాన్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది.. కానీ ఇక్కడ ప్రజలకు నీళ్లు లేవని ఆమె వీడియోలో అన్నారు. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకోవడంతో పాక్ తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటుంది. సింధ్ ప్రావిన్స్లో ప్రజలు నీళ్లు లేక అల్లాడి పోతున్నారు.
పాకిస్తాన్ అణు పరీక్షల వార్షికోత్సవ ర్యాలీని లాహోర్లో నిర్వహించారు. ఆ ర్యాలీలో ఉగ్రవాద అగ్రనేతలు పాల్గొన్నారు. భారత్పై మరోసారి సైఫుల్లా విద్వేషపూరిత ప్రసంగం చేశాడు. అహ్మద్ పేరుపై పంజాబ్ ప్రావిన్స్లో నిర్మాణాలు చేపడతానని సైఫుల్లా అన్నాడు. పహల్గాం ఉగ్రదాడిలో సైఫుల్లా మాస్టర్మైండ్.
Also Read: Shock To Trump: ట్రంప్ టారీఫ్ లకు యూఎస్ ఫెడరల్ కోర్ట్ బ్రేక్..
Also Read: Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
pakisthan | karachi-airport | india pak water war | water-problem | latest-telugu-news