/rtv/media/media_files/2025/02/11/rRFYNbq7ezBsQUaUegua.jpg)
arushi
సినిమాల్లో నటించాలని చాలా మంది అనుకుంటుంటారు. ఈ క్రమంలో సినిమాల్లో ఎదగాలనే ఆశలతో ఎంతో మంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరుగుతుంటారు. ఈ ప్రొసెస్ లో చాలా మంది మోసపోయే సంఘటనలు కూడా అనేకం వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా సినిమాల్లో నటించాలనే పిచ్చితో.. ఇల్లు, ఊరు, పట్టణం, నగరం, రాష్ట్రం వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్లి అష్టకష్టాలు పడిన వారిని.. ప్రాణాలు తీసుకున్న వారిని కూడా చూశాం.
తాజాగా కొందరు నిందితులు.. సినిమాలో హీరోయిన్ను చేస్తామని చెప్పి.. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆమె వద్ద నుంచి రూ.4 కోట్లు తీసుకుని మొహం చాటేశారు. ఉత్తరాఖండ్ మాజీ సీఎం రమేష్ పోఖ్రియాల్ కుమార్తె, నటి ఆరుషి నిశాంక్.. తనను ఇద్దరు ప్రొడ్యూసర్లు మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబైకి చెందిన ప్రొడ్యూసర్లు మానసి వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లా తన వద్ద నుంచి రూ. 4 కోట్లు తీసుకుని మోసం చేశారంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆరుషి నిశాంక్.. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్లో ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు చేసింది. వారిపై రూ.4 కోట్ల చీటింగ్ కేసుతోపాటు మానసిక హింస, బెదిరింపులకు పాల్పడటం వంటి అభియోగాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
అందుకు మీరే కావాలని...
ఆరుషి వద్దకు వచ్చిన ఆ ఇద్దరు నిర్మాతలు.. తమది ఎకా ఫిల్మ్స్ ప్రొడక్షన్ లిమిటెడ్ డైరెక్టర్ అని ఆమెను నమ్మించారు. తాము ‘ఆంఖో కి గుస్తాఖియాన్’ అనే సినిమాను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాలో షానయ కపూర్, నటుడు విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారని తెలిపారు. అయితే ఆ సినిమాలో మరో ప్రధాన నటి అవసరమని.. అందుకు మీరే కావాలని ఆరుషి ను సదరు నిర్మాతలు నమ్మించారు.
అయితే ఆ సినిమాలో తాను రూ.5 కోట్ల పెట్టుబడి పెడితే.. ప్రధాన నటి పాత్రతోపాటు.. విడుదలైన తర్వాత వచ్చే లాభాల్లో 20 శాతం కూడా ఇస్తామని వారిద్దరూ తనకు చెప్పినట్లు ఆరుషి పోలీసులకు తెలిపింది. ఒక వేళ.. సినిమాలో తనకు ఇచ్చిన పాత్ర నచ్చకపోయినా.. ఆ పాత్రతో సంతృప్తి చెందకపోయినా.. తాను చెల్లించిన మొత్తం డబ్బును 15 శాతం వడ్డీతో తిరిగి ఇస్తామని వారిద్దరూ హామీ ఇచ్చినట్లు వెల్లడించింది.
అయితే సినిమా స్క్రిప్ట్ కూడా తనకు చెప్పలేదని వాపోయింది. ఇక తన డబ్బును తిరిగి అడిగినప్పుడు.. సినిమా షూటింగ్ భారత్లో పూర్తి అయిందని.. యూరప్లో షూటింగ్ జరుగుతుందని చెప్పినట్లు తెలిపింది. ఆరుషి ఫిర్యాదుతో ఆ ఇద్దరు నిర్మాతలపై మోసం, మానసిక వేధింపులు, బెదిరింపులు, నేరపూరిత కుట్ర, ఐటీ చట్టం కింద కొత్వాలి పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!