Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం పై మగువ...బీజేపీ పెద్ద ప్లానే...నలుగురు ఎమ్మెల్యేలకు అవకాశం...!

27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ.. సీఎం అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది. సీఎం కుర్చీలో మహిళను కూర్చొబెట్టేందుకు బీజేపీ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందా..?. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
BJP

BJP

Delhi: కొద్ది రోజుల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ సీట్లలో 48 స్థానాలను దక్కించుకుని.. అధికారాన్ని చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి ఎంపికే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారైంది ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించడం బీజేపీ సంప్రదాయం కాదు. గెలిచిన తర్వాత.. ఎమ్మెల్యేలు, హైకమాండ్ కలిసి.. ముఖ్యమంత్రి సీటులో ఎవరిని కూర్చోబెట్టాలి అనేది నిర్ణయం తీసుకుంటారు. 

Also Read: BIG BREAKING: తెలంగాణలో మందు బాబులకు షాక్.. భారీగా ధరల పెంపు!

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి 2 రోజులుఅవుతున్నప్పటికీ కూడా.. ఇంకా సీఎం ఎంపికపై ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉండగా.. ఈనెల 13వ తేదీ తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలియనుంది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీ సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు పర్వేష్ వర్మ.

Also Read: Trump: ట్రంప్ నిర్ణయంతో హెచ్‌ఐవీ మరణాలు 63 లక్షలు పెరుగుతాయంటున్న ఐరాస...!

 ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోటీ చేసి మట్టికరిపించిన పర్వేష్ .. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు.కేజ్రీవాల్‌ని ఓడించిన పర్వేష్ వర్మ సీఎం రేసులో  ఉన్నారనే వార్తలు బీజేపీ వర్గాల్లో బలంగా వినపడుతున్న మాట. అయితే తాజాగా ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ముఖ్యమంత్రిగా ఒక మహిళ...

అయితే ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు.. తదుపరి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రిగా ఒక మహిళా ఎమ్మెల్యేని నియమించే అవకాశాలు కనపడుతున్నాయని సమాచారం. అంతేకాకుండా ఢిల్లీలోని బలహీన వర్గాల నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఢిల్లీ మంత్రివర్గంలో మహిళలు, దళితులకు బలమైన ప్రాతినిధ్యం ఉంటుందని సమాచారం.

ఇక ఢిల్లీకి మహిళా ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలంటే.. గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మహిళలు ఉన్నారు. వారే పూనమ్ శర్మ, నీలం పెహల్వాడ్‌, రేఖా గుప్తా, శిఖా రాయ్, . షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రేఖా గుప్తా.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత బందన కుమారిని 29,595 ఓట్లతో ఓడించారు. మరోవైపు.. గ్రేటర్ కైలాష్ స్థానం నుంచి బరిలోకి దిగిన శిఖా రాయ్.. ఆప్ కీలక నేత, ఢిల్లీ మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌ను 3188 ఓట్ల తేడాతో గెలిచారు.

ఇక వజీర్ పూర్ సీటు నుంచి పోటీలో ఉన్న పూనమ్ శర్మ.. ఆప్ అభ్యర్థి రాజేష్ గుప్తాకు పరాజయాన్ని బహుమతిగా అందించారు. చివరిగా నాజాఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన నీలం పెహల్వాన్.. ఆప్ నేత తరుణ్ కుమార్‌పై 29 వేల ఓట్ల తేడాతో ఘన విజయం అందుకున్నారు వీరి నలుగురిలో ఒకరికి ఢిల్లీ ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలని.. బీజేపీ అనుకుంటున్నట్లు సమాచారం.

Also Read:Horoscope Today: ఈ రాశి వారు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందపాటు నిర్ణయాలు తీసుకోవద్దు..జాగ్రత్త!

Also Read: Maha Kumbh mela: మహా కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన భక్తులు...కాశీలోనే ఆంక్షలు విధించిన అధికారులు!

Advertisment
Advertisment
తాజా కథనాలు