Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి

మధ్యప్రదేశ్​లో ఎస్​యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.

New Update
accident

accident

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ​లో ఎస్​యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదం (Road Accident) లో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, సిధీ జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 21మంది ఎస్​యూవీలో మైహార్​లోని శారదా మాత ఆలయానికి వెళ్తుతున్నారు.

Also Read: Kohli: ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!

Road Accident In Madhya Pradesh

Also Read: SLBC tunnel: TBM ఆపరేటర్‌ గురుప్రీత్ డెడ్‌బాడీ.. తెలంగాణ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా

రెండు గంటల ప్రాంతంలో సీధీ-బహ్రి రోడ్డులో పెట్రోల్‌ బంక్ వద్ద అతివేగంగా వస్తున్న ఓ ట్రక్కు, ఎస్​యూవీకి ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడికే ఏడుగురు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందతూ మరణించారు. సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రుల్లో 9మంది పరిస్థితి విషమంగా ఉందని, వారిని రేవా ఆసుపత్రికి తరలించినట్లు సీధీ డీఎస్పీ గాయత్రి తివారీ తెలిపారు. మిగిలిన వారికి సీధీ జిల్లా ఆస్పత్రినే చికిత్స జరుగుతోందని వెల్లడించారు. ఈ ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Also Read:  PM Modi: ఇది అసాధారణ మ్యాచ్‌..టీమిండియా విజయం అపూర్వం అంటూ మోడీ ప్రశంసలు!

Also Read: MLA Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి మంత్రి లోకేష్ ఫిదా.. రాష్ట్ర చరిత్రలోనే ఇదో అరుదైన రికార్డంటూ ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు