/rtv/media/media_files/2025/05/08/cHAppj8UE0tX5RcUdWMn.jpg)
Saudi minister makes unannounced Delhi visit amid India-Pakistan tensions
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసింది. తాజాగా సౌదీ అరేబియా విదేశాంగశాఖ సహాయమంత్రి అదెల్ అల్ జుబేర్ భారత్కు వచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ఆర్మీ ఆపరేషన్ సిందూర్ పేరుతో 9 ఉగ్రస్థావరాలపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సౌదీ అరేబియా మంత్రి అకస్మాత్తుగా భారత్ పర్యటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: గగన్యాన్ వ్యోమగామికి వాయుసేన పిలుపు.. యుద్ధ విమానాలు సిద్ధం!
గురువారం న్యూఢిల్లీలోని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ను అదెల్ అల్ జుబేర్ కలిశారు. ఆయన్ని కలిసినట్లు జైశంకర్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. '' ఈరోజు ఉదయం సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రి అదెల్ అల్ జుబేర్తో మంచి సమావేశం జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్ విధానాలను ఆయనతో షేర్ చేసుకున్నానని'' రాసుకొచ్చారు.
A good meeting with @AdelAljubeir, Minister of State for Foreign Affairs of Saudi Arabia this morning.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 8, 2025
Shared India’s perspectives on firmly countering terrorism.
🇮🇳 🇸🇦 pic.twitter.com/GGTfItZ3If
Also Read: పాక్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఇండియా.. క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే ముక్కలు
అయితే జైశంకర్తో ద్వైపాక్షిక జాయింట్ కమిషన్ మీటింగ్కు హాజరయ్యేందుకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చి బుధవారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వచ్చిన కొన్ని గంటల్లోనే జైశంకర్తో సహాయమంత్రి అదెల్ అల్ జుబేర్ భేటీ అయ్యారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ముస్లిం దేశాల మంత్రులు భారత్కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: పాక్ పై మళ్లీ దాడికి దిగిన ఇండియా.. ఆ 9 నగరాలపై ఎటాక్!
rtv-news | Indian Army | saudi-arabia | iran