India Drone Attack: పాక్ పై మళ్లీ దాడికి దిగిన ఇండియా.. ఆ 9 నగరాలపై ఎటాక్!

పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.

New Update
India Drone Attacks in Pakistan

India Drone Attacks in Pakistan

పాకిస్థాన్‌పై ఇండియన్ ఆర్మీ మళ్లీ దాడులకు దిగింది. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై డ్రోన్‌ దాడులు చేసింది. ఈ దాడుల్లో పాక్‌ వైమానిక రక్షణ వ్యవస్థలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్ అహ్మద్‌ షరీఫ్‌ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. లాహోర్, కరాచీ సహా పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులు జరిగినట్లు పేర్కొన్నారు. 

Also Read: 15 నిమిషాలు పవర్ ఇవ్వండి.. పాక్ ను నాశనం చేస్తాం.. MIM సంచలన ప్రకటన!

మరోవైపు ఆపరేషన్ సిందూర్‌ తర్వాత ఇండియాను ఎలాగైనా దెబ్బ గొట్టాలని పాకిస్థాన్‌ చూస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటాక 15 నగరాలపై క్షిపణి దాడులకు యత్నించింది. అయితే పాక్‌ నుంచి వచ్చిన క్షిపణులను, డ్రోన్లను తిప్పి కొట్టినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరాలాయ్ మరియు భుజ్‌లపై మిస్సైల్ దాడులకు యత్నించింది. వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్ అండ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. 

rtv-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు