Operations Sindoor: గగన్‌యాన్‌ వ్యోమగామికి వాయుసేన పిలుపు.. యుద్ధ విమానాలు సిద్ధం!

పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష యాత్ర వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటున్న గగన్‌యాన్‌ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించింది. యద్ధ విమానాలు నడపడంలో అజిత్ కు చాలా అనుభవం ఉంది.

New Update
gaganyan

Gaganyaan astronaut Group Captain Ajit Krishnan come back

Operations Sindoor: పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత వాయుసేన సంచలన నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష యాత్ర వెళ్లేందుకు శిక్షణ తీసుకుంటున్న గగన్‌యాన్‌ వ్యోమగామి అజిత్ కృష్ణన్‌ను వెనక్కి పిలిపించింది. యద్ధ విమానాలను నడిపిన అనుభవం ఆయన సొంతం.  

2900 గంటలు నడిపిన అజిత్.. 

ఈ మేరకు అజిత్‌ 2003లో ఐఏఎఫ్‌లో చేరగా వాయుసేనలో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. 2900 గంటలకు పైగా పలురకాల యద్ధ విమానాల్ని నడిపిన అనుభవం ఆయన సొంతం. ‘ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఐఏఎఫ్ నుంచి పిలుపొచ్చింది’ అని అజిత్ తెలిపారు. ఇక భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ కోసం వాయుసేన నుంచి ఎంపికైన వారిలో అజిత్ ఉన్నారు. కాగా ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్‌ స్పేస్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కాన్ఫరెన్స్‌లో తాను తిరగివస్తున్న విషయాన్ని వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: Mother’s Day 2025: మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

ఇండియానుంచి స్వదేశీ వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి భారతీయ బృందం ఇదే. కాగా వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాంశు శుక్లాల యాత్ర 2027లో జరగనుంది. అజిత్, అంగద్ భారత్‌లో శిక్షణ పొందుతుండగా.. శుభాంశు శుక్లా, నాయర్ అమెరికాలో శిక్షణ తీసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: operation Sindoor: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

 

gaganyan | pakistan | telugu-news | today telugu news

Advertisment
Advertisment
తాజా కథనాలు