Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులు దాటాయని.. ఇలాంటివి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు ఉన్నవారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థపై ప్రజలకు బాధ్యత రాహుల్పై ఉందని.. కానీ ఆయన దీనికి బదులు అబద్దాలు వ్యాప్తి చేస్తూ దేశ ఐక్యతను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇదిలాఉండగా..ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
'' బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతీ సంస్థను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటుగా భారతదేశంపై కూడా పోరాడుతున్నామని'' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శలు చేశారు. అయితే తాజాగా రాహుల్గాంధీపై దీనిపై కేసు నమోదవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై కేసు నమోదు.. ఎందుకంటే ?
కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Rahul Gandhi
కాంగ్రెస్ పార్టీ దేశంతోనూ పోరాడుతుందని విపక్ష నేత రాహుల్ గాందీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యా్ఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్పై అస్సాంలోని గువాహటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్జిత్ చాటియా అనే వ్యక్తి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు వాక్ స్వాతంత్ర్య పరిమితులు దాటాయని.. ఇలాంటివి జాతీయ భద్రతకు ముప్పు తెచ్చిపెడతాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:బిహార్ కులగణన ఫేక్ అన్న రాహుల్.. స్పందించిన ఎన్డీయే
ఆయన చేసిన వ్యాఖ్యలు అశాంతితో పాటు వేర్పాటువాద భావాలు ఉన్నవారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. విపక్ష నేతగా ప్రజాస్వామ్య సంస్థపై ప్రజలకు బాధ్యత రాహుల్పై ఉందని.. కానీ ఆయన దీనికి బదులు అబద్దాలు వ్యాప్తి చేస్తూ దేశ ఐక్యతను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇదిలాఉండగా..ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
Also Read: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు
'' బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలోని ప్రతీ సంస్థను కూడా తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్తో పాటుగా భారతదేశంపై కూడా పోరాడుతున్నామని'' రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పలువురు కేంద్ర మంత్రులు రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా విమర్శలు చేశారు. అయితే తాజాగా రాహుల్గాంధీపై దీనిపై కేసు నమోదవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: వందలు కాదు వేలల్లో రండిరా..12 గంటల్లో 1057మందితో శృంగారం.. ఇదిగో వీడియోలు!
Also read: దొంగకు అది సైఫ్ అలీఖాన్ ఇల్లు అని తెలీదు: అజిత్ పవార్