Ajit Pawar: దొంగకు అది సైఫ్‌ అలీఖాన్‌ ఇల్లు అని తెలీదు: అజిత్‌ పవార్‌

సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దుండగుడు దొంగతనం చేసేందుకు వచ్చాడని.. అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని అతడికి తెలియదని పేర్కొన్నారు. ముంబైలో లా అండ్ ఆర్డర్‌ విఫలమైందని విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు.

New Update
Saif Ali Khan

Saif Ali Khan

బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఓ దుండగుడు దాడి చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పోలీసులు నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దుండగుడికి అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అని తెలియదని పేర్కొన్నారు. '' అతడు ఒక దొంగ. బంగ్లాదేశ్‌కు చెందినవాడు. ముందుగా కోల్‌కతాకు చేరుకొని ఆ తర్వాత ముంబయికి వచ్చాడు. దొంగతనం చేసేందుకు ఓ ఇంటిని ఎంచుకున్నాడు. ఇందులో భాగంగానే సైఫ్‌ ఇంట్లో చొరబడ్డాడు. అది సైఫ్ అలీ ఖాన్ ఇల్లు అన్న విషయం ఆ దొంగకు తెలియదు. 

Also Read: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు

విపక్ష పార్టీలు మా ప్రభుత్వం వైఫల్యం వల్లే దాడి జరిగిందని చెప్పడం సరైంది కాదు. ముంబైలో లా అండ్ ఆర్డర్‌ విఫలమైందని విపక్ష పార్టీలు పదే పదే ఆరోపణలు చేయడం సరికాదు. ఇలా విమర్శంచడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని'' అజిత్ పవార్ అన్నారు. ఇదిలాఉండగా.. సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది బంగ్లాదేశ్‌కి చెందినవాడని ముంబై పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.  పోలీసులు నిందితుడిని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. 

Also Read: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!

దీనికి సంబంధించి ముంబయి జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడం మీడియా మాట్లాడారు. '' నిందితుడి పేరు మహ్మద్ షరీఫుల్ షెహజాద్. విజయ్‌ దాస్‌గా అందరికీ తన పేరు చెప్పుకుంటున్నాడు. 6 నెలల క్రితమే ఫేక్ పత్రాలతో ఇండియాలో చొరబడ్డాడు. కొన్నాళ్ల నుంచి ముంబయిలో ఓ బార్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. దొంగతనం చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంట్లో చొరబడ్డాడు. కొన్నిరోజులు ఓ హౌస్ కీపింగ్ ఏజెన్సీలో కూడా పనిచేశాడు. ఆ సమయంలోనే సైఫ్ ఇంటికి వెళ్లినట్లు అనుమానాలున్నాయి. వీటికి సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నాం. ప్రస్తుతం అతడిపై విచారణ జరుగుతోందని'' దీక్షిత్ గెడం తెలిపారు.  

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు