Maha Kumbh Mela Extension: మహాకుంభమేళా పొడిగింపు.. క్లారిటీ ఇచ్చిన ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్

కుంభమేళా పొడిగిస్తున్నట్లు వ‌స్తున్న వార్తల్లో నిజం లేద‌ని ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ ర‌వీంద్ర మంద‌ర్ తెలిపారు. మ‌త‌ప‌ర‌మైన, మంగ‌ళ‌క‌ర‌మైన ముహూర్తం ఆధారంగా మ‌హాకుంభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 26న కుంభమేళా ముగుస్తోందని కలెక్టర్ చెప్పారు.

New Update
DM Prayagraj

DM Prayagraj Photograph: (DM Prayagraj)

Maha Kumbh Mela Extension: ప్రయాగ్‌రాజ్(Prayagraj) కుంభమేళా గడువు ఫిబ్రవరి 26తో ముగియనుంది. మహాకుంభమేళా త్రివేణి సంగ‌మంలో పుణ్యస్నానాలు గడువు పొడిగిస్తు్న్నట్లు వస్తున్న వార్తలపై ప్రయాగ్‌రాజ్ జిల్లా కలెక్టర్ స్పందించారు. భారీ సంఖ్యలో జ‌నం వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌హాకుంభ్‌ను పొడిగిస్తున్నట్లు వ‌స్తున్న వార్తల్లో నిజం లేద‌ని ప్రయాగ్‌రాజ్ జిల్లా మెజిస్ట్రేట్ ర‌వీంద్ర మంద‌ర్ తెలిపారు. మ‌త‌ప‌ర‌మైన, మంగ‌ళ‌క‌ర‌మైన ముహూర్తం ఆధారంగా మ‌హాకుంభ అమృత స్నానాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. దీంట్లో ఎటువంటి మార్పు ఉండ‌బోదుఅని జిల్లా కలెక్టర్ ర‌వీంద్ర వెల్లడించారు.

Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్

Also Read: Prabhas Spirit Updates: 'స్పిరిట్' మ్యూజిక్ డైరెక్ట‌ర్ అదిరిపోయే అప్‌డేట్..!

ఫిబ్రవ‌రి 26న శివ‌రాత్రితో ముగింపు.. 

ముందుగా నిర్ణయించిన‌ట్లు ఫిబ్రవ‌రి 26వ తేదీన కుంభ్ స్నానాలు ముగియ‌నున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మ‌హాకుంభమేళాలో 55 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఆయన వివరించారు. జనవరి 13న ప్రారంభమైన మ‌హాకుంభ.. ఫిబ్రవ‌రి 26న శివ‌రాత్రితో ముగియ‌నున్నదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: BIG BREAKING: మోనాలిసాకు బిగ్ షాక్.. మోసం చేసిన డైరెక్టర్?

తప్పుడు వార్తల నమ్మోదని భక్తులకు ప్రయాగ్ రాజ్ కలెక్టర్ సూచించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేర‌కు.. భ‌క్తల‌కు అన్ని సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. మ‌రో 7రోజుల పాటు మ‌హాకుంభ్ జ‌ర‌గ‌నున్నద‌ని, దాని కోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచిన‌ట్లు పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం యంత్రాంగం నిర్విరామంగా ప‌నిచేస్తోంద‌న్నారు. ఎక్కడ కూడా రైల్వే స్టేష‌న్లను మూసివేయ‌లేద‌న్నారు. ద‌రాగంజ్‌లో ఉన్న ప్రయాగ్ సంగం స్టేష‌న్ మాత్రమే మూసిన‌ట్లు చెప్పారు. మేళా ప్రాంతానికి స‌మీపంలో ఉన్న కార‌ణంగా, ఆ స్టేష‌న్‌ను క్లోజ్ చేసిన‌ట్లు తెలిపారు.

Also Read:  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు