Maha Kumbh stampede : కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు