Israel: ముస్లిం దేశాలపై ఇజ్రాయెల్ యుద్ధం.. నెక్స్ట్ పాకిస్థాన్‌పై దాడులు !

ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, యెమెన్, సిరియా, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. దీంతో ఇజ్రాయెల్ తర్వాతి టార్గెట్‌ పాకిస్థానేనని ఆ దేశ ఎంపీ అసద్‌ క్వైజర్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

New Update
Israel next target is pakistan, Says Pakistan MP

Israel next target is pakistan, Says Pakistan MP

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని టెహ్రాన్‌కు టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను కూడా ధ్వంసం చేసింది.  

ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసేందుకు పనులు జరుగుతున్నాయని.. ఇది తమకు ముప్పుగా భావించే ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ముస్లిం దేశాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పటికే ముస్లిం దేశాలైన గాజా, యెమెన్, సిరియా, లెబనాన్ దేశాలపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు పాకిస్థాన్‌ వెన్నులో వణుకు పడుతోంది.  
ఇటీవల పాక్‌ పార్లమెంట్‌లో ఆ దేశ ఎంపీ అసద్‌ క్వైజర్‌ ఈ అంశం గురించి మాట్లాడారు.

Also Read: మహిళా ప్యాసింజర్‌ను కొట్టిన ర్యాపిడో డ్రైవర్.. ఇంత దారుణమా..?

ఇజ్రాయెల్ ముస్లిం దేశాలపై దాడులు చేస్తోందని.. తర్వాతి టార్గెట్‌ పాకిస్థానేనని అన్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య కుదిరిన మిలిటరీ అవగాహన ఒప్పందం పాకిస్థాన్‌కు ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇరాన్‌తో పాక్‌ 1200 కిలోమీటర్ల సరిహద్దు కలిగిఉందని.. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నెక్స్ట్‌ టార్గెట్‌ పాకిస్థానే అని తెలిపారు. అంతేకాదు ఇటీవల భారత్‌-పాక్ యుద్ధంలో భారత్‌ వినియోగించిన డ్రోన్‌లు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినవేనని పేర్కొన్నారు. 

Also Read: కీలక చమురు క్షేత్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడులు..టెహ్రాన్‌పై బాంబుల వర్షం

పాకిస్థాన్‌పై అల్లా కరుణించి రక్షించాలని అసద్‌ క్వైజర్ పార్లమెంట్‌ వేదికగా వేడుకున్నారు. అలాగే ఈ కష్టకాలంలో ఇరాన్‌కు మద్దతుగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నరు. ఇరాన్‌కు మనం అండగా ఉండాలంటూ పిలుపునిచ్చారు.మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యకు ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందని రష్యా ఆరోపించింది. ఖమేనీని లేపేయబోతున్నారని అమెరికా అధికారులు  ప్రకటించినట్లు వెల్లడించింది. ఈ విషయమై ఖమేనీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి వీలైనంత త్వరగా దేశం వదిలి పారిపోవాలని సలహా ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంలో 224 మంది మృతి చెందగా, 1277 మందికి గాయాలయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు